నిజంనిప్పులాంటిది

Aug 03 2023, 18:39

Political BRO : 'బ్రో' సినిమాపై ఆగని రచ్చ.. ఢిల్లీ వేదికగా మరోసారి మంత్రి రాంబాబు సంచలన వ్యాఖ్యలు

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Janasena Chief Pawan Kalyan), సాయిధరమ్ తేజ్ (Sai Dharam Tej) ప్రధాన పాత్రల్లో నటించిన 'బ్రో' (BRO) మూవీపై ఏపీ రాజకీయాల్లో (AP Politics) పెద్ద దుమారమే రేగుతోంది..

ఇందులో సీఎం వైఎస్ జగన్ రెడ్డిని (CM YS Jagan Reddy) ఉద్దేశించి కొన్ని డైలాగ్స్, మంత్రి అంబటి రాంబాబు (Minister Rambabu) సంక్రాంతి పండుగకు వేసిన డ్యాన్స్‌ను ఇమిటేట్ చేస్తున్నట్లు ఉన్నాయని ఈ మూవీ టీమ్‌పై వైసీపీ శ్రేణులు (YSR Congress) మండిపడుతున్నాయి.

ఛాన్స్ దొరికితే చాలన్నట్లుగా మునుపటిలాగే పవన్‌పై సోషల్ మీడియా (Social Media) వేదికగా తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు.

ఇప్పటికే అటు చిత్రబృందం.. ఇటు అంబటి రాంబాబు ఒకరిపై ఒకరు ఓ రేంజ్‌లో విమర్శలు గుప్పించుకున్నారు. సీన్ కట్ చేస్తే ఈ వ్యవహారం గల్లీ నుంచి ఢిల్లీకి చేరింది.

బుధవారం నాడు ఢిల్లీకెళ్లిన అంబటి.. 'బ్రో' మూవీపై ఫిర్యాదు చేస్తానన్నారు. ఢిల్లీ వేదికగా మీడియా మీట్ నిర్వహించిన మంత్రి.. బ్రో సినిమా, పోలవరం ప్రాజెక్టుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

నిజంనిప్పులాంటిది

Aug 03 2023, 16:05

కుటుంబ సభ్యులతో మోడీని కలిసిన బండి సంజయ్

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ కుమార్ గురువారం కుటుంబ సభ్యులతో కలిసి ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలిశారు.

జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన తరువాత తొలిసారి బండి సంజయ్ ప్రధానిని కలిశారు.

తెలంగాణలో బీజేపీ బలోపేతానికి ఎంతగానో కష్టపడ్డారని బండి సంజయ్ ను మోడీ ఈ సందర్భంగా అభినందించారు.

రాబోయే ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకురావాల్సి ఉన్నందున మరింత కష్టపడి పనిచేయాలని సూచించారు.

ఈ సందర్భంగా కుటుంబ సభ్యులతో ఫోటోలు దిగడంతో పాటు వారి యోగ క్షేమాలను ప్రధాని అడిగి తెలుసుకున్నారు........

నిజంనిప్పులాంటిది

Aug 03 2023, 16:03

అసెంబ్లీ సాక్షిగా ఈటెలపై ప్రేమ వర్షం కురిపించిన కేటీఆర్

తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు గురువారం ఉదయం 11:30 గంటలకు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో అసెంబ్లీ లోపల ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది.

మంత్రి కేటీఆర్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సీటు వద్దకు వెళ్ళి ఆప్యాయంగా పలుకరించి ఆలింగనం చేసుకున్నారు. ఒకరినొకరు హత్తుకున్నారు. పదినిమిషాల పాటు ఇరువురు మాట్లాడుకున్నారు.

కాగా అసెంబ్లీ సమావేశాలు మొదలైన వెంటనే రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్, ప్రముఖ గాయకుడు, కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్నకు సభ నివాళి అర్పించింది. సాయన్న మృతికి ముఖ్యమంత్రి కేసీఆర్ సభలో సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు.

ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. సాయన్న లేని లోటు తీర్చలేనిదన్నారు. కంటోన్మెంట్‌ను జీహెచ్‌ఎంసీలో కలపాలని ఆయన ఎంతో కృషి చేశారని గుర్తుచేశారు. సాయన్న అట్టడుగు వర్గాల నుంచి వచ్చిన నేత అని అన్నారు.

సాయన్న కుటుంబానికి సీఎం కేసీఆర్ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మిగిలిన సభ్యులు కూడా సాయన్న మృతిపట్ల సంతాపం తెలుపుతూ.. ఆయనతో ఉన్న అనుబంధాన్ని సభా వేదికగా పంచుకున్నారు. సాయన్న మృతికి శాసనసభ రెండు నిమిషాలు మౌనం పాటించింది. అనంతరం తెలంగాణ అసెంబ్లీ రేపటికి శుక్రవారం వాయిదా పడింది.

నిజంనిప్పులాంటిది

Aug 03 2023, 13:53

తిరుపతి లడ్డు కు 308 ఏళ్ల చరిత్ర

ఏడుకొండలు ఎక్కి వెంకన్నను దర్శించుకున్నంత పుణ్యం.. తిరుపతి లడ్డూను తింటే వస్తుందనే నమ్మకం తెలుగు ప్రజల్లో ఎక్కువ. తిరుమల వెంకన్న కోరిన కోర్కెలు తీర్చే దేవదేవుడని, తమ కష్టాలను తొలగించే దివ్య పురుషుడని భక్తుల విశ్వాసం. అందుకే.. నిత్యం లక్షల సంఖ్యలో భక్తులు తిరుమలకు వస్తుంటారు.

అలా తిరుమలకు వచ్చిన భక్తులు స్వామి వారి దర్శనం అనంతరం, స్వామి వారి ప్రసాదమైన లడ్డూనూ తమతో పాటూ ఇంటికి తీసుకెళ్తూ ఉంటారు. ఈ లడ్డూను తమ ఇంటిలో భక్తి శ్రద్దలతో పూజించి ఆత్మీయులకు పంచిపెడుతూ ఉంటారు.

అంతటి విశిష్టత ఉన్న తిరుపతి లడ్డూ.. ఇప్పుడు మూడు వందల సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఆలయ పోటులో ప్రత్యేకంగా తయారయ్యే ఈ లడ్డూలను స్వామివారి ప్రసాదంగా పంపిణీ చేయడం ప్రారంభించి ఇప్పటికి 308 ఏళ్లు పూర్తయ్యాయి.

1715 ఆగస్టు 2 న తొలిసారిగా లడ్డూను భక్తులకు ప్రసాదంగా పంపిణీ చేయడం ప్రారంభించినట్లు తెలుస్తోంది.కాలానుగుణంగా పెరుగుతున్న భక్తుల రద్దీ నేపధ్యంలో రోజూ దాదాపు మూడు లక్షల ఇరవై వేల లడ్డూలను టీటీడీ తయారు చేస్తోంది.

ఇంతటి విశిష్టత, ప్రాధాన్యత కలిగిన తిరుపతి లడ్డూకు పేటేంట్, ట్రేడ్ మార్క్ కూడా ఉన్నాయి. 2014లో తిరుపతి లడ్డూకు జియోగ్రాఫికల్ ఇండికేషన్స్ గుర్తింపు కూడా లభించింది. ఆ విధంగా తరాలు మారుతున్నా తరగని రుచితో.. హిందువుల మనసులో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది తిరుపతి లడ్డూ. అంతేకాదు తిరుమల శ్రీవారికి సమర్పించే నైవేద్యాలకి పెద్ద చరిత్రే ఉంది. సుప్రభాత సమయంలో స్వామి వారికి వెన్నతో మొదలు పెట్టి, లడ్డూ, వడ, పోంగలి, దద్దోజనం, పులిహోరా, వడపప్పు, ఇలా రకరకాల నైవేద్యాలను నివేదిస్తారు. తిరుమల లడ్డూకు ఏకంగా 308 ఏళ్ల చరిత్ర ఉందంటే కాస్త ఆశ్చర్యంగా ఉందనే చెప్పాలి...

నిజంనిప్పులాంటిది

Aug 03 2023, 13:08

అసెంబ్లీ రేపటికి వాయిదా.. మరికాసేపట్లో బీఏసీ సమావేశం

హైదరాబాద్‌:ఆగస్టు 03

అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే జీ.సాయన్న మృతిపట్ల అసెంబ్లీ నివాళులర్పించింది. సభలో సాయన్న మృతి పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు.

ఈ సందర్భంగా దివంగత ఎమ్మెల్యేతో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. అనంతరం సభ రేపటికి వాయిదా పడింది. కాగా, మరికాసేపట్లో స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ నేతృత్వంలో బీఏసీ సమావేశం జరుగనున్నది. ఈ సందర్భంగా సమావేశాలు ఎన్నిరోజులపాటు నిర్వహించాలి, ఏయే అంశాలపై చర్చించాలనే అంశాలను నిర్ణయించనున్నారు.

వివాదరహితుడు సాయన్న: సీఎం కేసీఆర్‌

దివంగ ఎమ్మెల్యే సాయన్న.. నాలుగు దశాబ్దాల పాటు రాజకీయాల్లో కొనసాగారని, శాసన సభ్యుడిగా.. ఇతర అనేక హోదాల్లో పని చేశారని సీఎం కేసీఆర్‌ అన్నారు.

ఆయనతో తనకు వ్యక్తిగతంగా మంచి అనుబంధముందన్నారు. ఎటువంటి సందర్భంలోనైనా చిరునవ్వుతో చాలా ఓపికతో ఉండేవారని, అందరితో కలుపుగోలుగా ఉండేవారని సీఎం కేసీఆర్‌ గుర్తు చేసుకున్నారన్నారు. జీహెచ్‌ఎంసీలో కంటోన్మెంట్‌ను కలిపేందుకు ఎనలేని కృషి చేశారన్నారు. కంటోన్మెంట్‌ ప్రజలకు చాలా తపనపడేవారన్నారు. అనేక సందర్భాల్లో తీర్మానాలు చేసి కేంద్రానికి పంపామని చెప్పారు.

ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేసి కంటోన్మెంట్లను నగరపాలికల్లో కలపాలని ఆలోచిస్తుందన్న శుభవార్త అందింది. ఆ రకంగానైనా సాయన్న కోరిక నెరవేరాలని కోరుకుంటున్నానని చెప్పారు. వివాదరహిత నేతల్లో ఆయన ఒకరని, ఆయన కూతురు సైతం నగరంలో కార్పొరేటర్‌గా సేవలందించారని తెలిపారు. సాయన్న కుటుంబం తమ కుటుంబంలాంటిదని, వారికి అండగా ఉంటామని వెల్లడించారు...

నిజంనిప్పులాంటిది

Aug 03 2023, 13:06

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ; తప్పదా ❓️

విశాఖ ఉక్కు కర్మాగారం, దాని అనుబంధ సంస్థల ప్రైవేటీకరణ తప్పదని కేంద్రం స్పష్టం చేసింది. ఆ సంస్థల్లో నూటికి నూరు శాతం పెట్టుబడుల ఉపసంహరణ చేయాలని కేంద్రం నిర్ణయించిందని కేంద్ర ఉక్కుశాఖ మంత్రి ఫగన్‌ సింగ్‌ కులస్తే చెప్పారు.

ప్రభుత్వ రంగ సంస్థలపై నూతన విధానాన్ని రూపొందించాం.

దాని ప్రకారం వ్యూహాత్మక, వ్యూహాత్మకేతర రంగాలుగా విభజించాం. వ్యూహాత్మకేతర రంగాలను సాధ్యమైనంత వరకూ ప్రైవేటీకరించాలని నిర్ణయించాం’’ అని మంత్రి బుధవారం లోక్‌సభలో చెప్పారు. టీడీపీ సభ్యుడు కే రామ్మోహన్‌ నాయుడు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా... ‘‘రాష్ట్రీయ ఇస్పాత్‌ నిగమ్‌ విశాఖ ఉక్కు కర్మాగారం ఉక్కు మంత్రిత్వ శాఖ నియంత్రణలో ఉంది.

ఈ సంస్థలో రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి వాటా లేదు. అయితే నిర్దిష్టమైన విషయాల్లో అవసరమైనపుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదిస్తాం.

విశాఖ ఉక్కు ఆదాయం 2020-21 లో రూ.18,080.88 కోట్లు. అది 2021-22 సంవత్సరానికి రూ.28,359.35 కోట్ల కు చేరి 2022-23లో రూ.22,809.40 కోట్లకు దిగింది. అదే సమయంలో ఈ సంస్థ నష్టాలు 2020-21లో రూ.789.10 కోట్లుండగా, 2022-23 నాటికి రూ.2,858.74 కోట్లకు చేరుకుంది.

2021-22లో రూ.913.19 కోట్ల లాభానికి చేరుకున్నప్పటికీ మళ్లీ నష్టాల బాట పట్టింది’’ అని మంత్రి కులస్తే వివరించారు.

నిజంనిప్పులాంటిది

Aug 03 2023, 11:26

ఇవే చివరి అసెంబ్లీ సమావేశాలు ?

- మరికొద్దినెలల్లో రాష్ట్రంలో ఎన్నికల జంక్ సైరన్ !

- అసెంబ్లీలో చర్చలపై ఉత్కంఠ

- రైతు రుణమాఫీ పై సర్కార్ నిర్ణయం

- ఆర్టీసి సంస్థఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం పై గైడ్ లైన్స్

- ప్రత్యేక నూతన పథకాల అమలు పై చర్చలు

తెలంగాణ(Telangana) వర్షాకాలం అసెంబ్లీ సమావేశాలు (Assembly Meetings)మరికాసేపట్లో ప్రారంభం కానున్నాయి. ఉదయం 11.30గంటలకు ఉభయ సభలు ప్రారంభమవుతాయి. సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలి..ఏ ఏ అంశాలపై చర్చించాలనే విషయాన్ని ఈరోజు జరిగే బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు.

సభ ప్రారంభం కాగానే కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న(Cantonment MLA Sayanna) మృతిపై సభలో సీఎం కేసీఆర్ (KCR)సంతాప తీర్మనం ప్రవేశపెట్టనున్నారు. మండలిలో మాజీ ఎమ్మెల్సీ వేదెల వెంకట నర్సింహచారి(Vedela Venkata Narsimhachari) మృతికి సంతాపం ప్రకటిస్తారు. రాబోయే ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్న బీఆర్ఎస్‌ (BRS)పార్టీ అందుకు తగినట్లుగానే టీఎస్ ఆర్టీసీ ఉద్యోగులను(RTC Employees) ప్రభుత్వంలో విలీనం చేస్తూ గత నెల 31న జరిగిన క్యాబినెట్ భేటీలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇప్పుడు జరిగే అసెంబ్లీ సమావేశాల్లో ప్రధానంగా టీఎస్‌ఆర్టీసీ ఉద్యోగుల విలీనం బిల్లును రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది.

దీన్ని ఆమోదించి అనంతరం దీనిని గవర్నర్‌ ఆమోదం కోసం పంపించనుంది. దీంతో పాటు గతంలో గవర్నర్‌ వివరణ కోరిన మూడు కీలక బిల్లులను ప్రభుత్వం శాసన సభలో చర్చకు పెట్టి మళ్లీ ఆమోదింపజేసుకోనుంది. అలాగే వర్షాలు, వరదలతో ఏర్పడిన నష్టంపై కూడా సభలో చర్చించనుంది. అదే విధంగా కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్ రావు ఎన్నిక చెల్లదంటూ హైకోర్టు తీర్పుఅంశంపై కూడా హాట్‌ టాపిక్‌గా మారింది. ఈసారి వర్షాకాలం సమావేశాల్లో వనమా హాజరుతారా లేక జలగం అటెండ్ అవుతారా అనే విషయంపై క్లారిటీ రానుది.

బహుశా ఇవే చివరి సమావేశాలా..?

తెలంగాణ వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి మొదలవతున్నాయి. ఈసారి సమావేశాలు బీఆర్ఎస్ ప్రభుత్వానికి చివరి సమావేశాలు కావడంతో ఎన్ని రోజులు నిర్వహించాలి..? ఏ ఏ అంశాలపై చర్చించాలి..? ఏ బిల్లులను ఆమోదించాలనే ..? విషయంపై సాయంత్రం జరిగే బీఏసీ సమావేశంలో నిర్ణయించనున్నారు. సమావేశాలు ప్రారంభం కాగానే ఇటీవలే మృతి చెందిన ఎమ్మెల్యే సాయన్న, మాజీ ఎమ్మెల్సీ వేదెల వెంకట నర్సింహచారికి సంతాపం ప్రకటించనుంది. అటుపై ఆర్టీసీ ఉద్యోగుల విలీనం అంశంపై చర్చ..ఆ బిల్లును ఆమోదించుకొని గవర్నర్‌కు పంపనుంది. కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఎన్నిక చెల్లదంటూ హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఆయనపై కేసు గెలిచిన జలగం వెంకట్రావు(Jalagam Venkat Rao) ప్రమాణ స్వీకారం చేయలేదు. దీనిపై వారం రోజులుగా ఈసీ క్లారిటీ ఇవ్వలేదు.అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో సెషన్స్ కు ఎవరు హాజరవుతారనే దానిపై ఆసక్తి నెలకొంది.

నిజంనిప్పులాంటిది

Aug 03 2023, 11:23

కాంగ్రెస్‌లోకి జూపల్లి కృష్ణారావు

ఎట్టకేలకు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. గురువారం ఉదయం ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే సమక్షంలో జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఉదయమే జూపల్లితో పాటు పలువురు నేతలు ఖర్గే నివాసానికి చేరుకున్నారు.

కాసేపటి క్రితమే జూపల్లి సహా కూచుకుల్ల రాజేశ్ రెడ్డి, వనపర్తి నేత మెగారెడ్డి, మాజీ శాసనసభ్యులు గుర్నాథ్ రెడ్డి, ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా నేతలకు ఖర్గే కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ఇంచార్జ్ మాణిక్ రావు ఠాక్రే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంపత్ తదితరులు పాల్గొన్నారు.

కాగా.. జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ చేరిక పలుమార్లు వాయిదా పడిన విషయం తెలిసిందే. ఇప్పుడు అప్పుడూ అంటూ గత రెండు నెలల నుంచి వాయిదా పడుతూనే వస్తోంది. చివరకు గత నెలలో మహబూబ్‌నగర్‌ జిల్లాలో భారీ బహిరంగ సభ నిర్వహించి జూపల్లిని కాంగ్రెస్‌లోకి ఆహ్వానించాలని పార్టీ వర్గాలు భావించాయి. ఈ సభకు ప్రియాంక గాంధీ ముఖ్య అతిథిగా వస్తారని తెలంగాణ కాంగ్రెస్ నేతలు ప్రచారం కూడా నిర్వహించారు.

అయితే భారీ వర్షాల కారణంగా ఆ సభ కూడా వాయిదా పడిపోయింది. దీంతో నిన్న బుధవారం జూపల్లి కాంగ్రెస్‌లో చేరేందుకు ముహూర్తం ఫిక్స్ చేశారు. ఈ క్రమంలో జూపల్లి సహా మిగిలిన నేతలంతా మంగళవారం సాయంత్రమే ఢిల్లీకి చేరుకున్నారు.

నిన్న ఉదయం నుంచి జూపల్లి కాంగ్రెస్‌లో చేరికపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. చివరకు అనివార్య కారణాల వల్ల జూపల్లి చేరిక వాయిదా పడినట్లు కాంగ్రెస్ సీనియర్ ఉపాధ్యక్షులు మల్లురవి వెల్లడించారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే సమక్షంలో జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ పార్టీలో చేరాల్సి ఉంది.

అయితే నిన్న రాష్ట్రపతితో ప్రతిపక్ష నేతల అపాయింట్మెంట్ నేపథ్యంలో ఖర్గే బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో జూపల్లి చేరిక మరోసారి వాయిదా పడింది. చివరకు ఈరోజు ఉదయం మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. కొల్లాపూర్‌లో త్వరలోనే భారీ బహిరంగ సభ పార్టీ వర్గాలు తెలియజేశాయి.......

నిజంనిప్పులాంటిది

Aug 03 2023, 11:22

రైతు రుణామాఫీ... చారిత్రాతమకమైన నిర్ణయం !

రైతులకు సీఎం కేసీఆర్ గుడ్‌న్యూస్ వినిపించారు. రైతు రుణమాఫీ కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభించాలని సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. రైతు రుణమాఫీపై ప్రగతి భవన్‌లో సమీక్షా సమావేశం నిర్వహించిన కేసీఆర్.. ఈ కార్యక్రమాన్ని ఆగస్టు 3 నుంచి ప్రారంభించి.. సెప్టెంబర్ రెండు వారంలోపు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటికే అందించిన రుణమాఫీ కాకుండా మరో రూ.19 వేల కోట్ల రుణమాఫీని రైతులకు అందించాల్సుందని కేసీఆర్ పేర్కొన్నారు.

19 వేల కోట్ల రుణమాఫీ చేయనున్నట్టు కేసీఆర్ స్పష్టం

చేశారు. తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. రైతుల రుణమాఫీని తిరిగి ప్రారంభించాలని నిర్ణయించి.. అన్నదాతలకు గుడ్‌న్యూస్ వినిపించింది. రైతు రుణమాఫీ కార్యక్రమాన్ని ఆగస్టు 3 నుంచి తిరిగి ప్రారంభించాలని సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రైతు రుణమాఫీ కార్యక్రమాన్ని రేపటి నుంచి తిరిగి ప్రారంభించాలని మంత్రి హరీశ్ రావుతో పాటు కార్యదర్శి రామకృష్ణారావును సీఎం కేసీఆర్ ఆదేశించారు.

రైతుబంధు తరహాలో విడతల వారీగా కొనసాగిస్తూ.. నెలపదిహేను రోజుల్లో, సెప్టెంబర్ రెండో వారం వరకు.. రైతు రుణ మాఫీ కార్యక్రమాన్ని సంపూర్ణంగా పూర్తిచేయాలని సీఎం కేసీఆర్ స్పష్టమైన ఆదేశాలిచ్చారు. ఇప్పటికే అందించిన రుణమాఫీ పోను మరో 19 వేల కోట్ల రూపాయల రుణమాఫీని రైతులకు అందించాల్సి వుందని సీఎం కేసీఆర్ తెలిపారు. తెలంగాణ రైతాంగ సంక్షేమం వ్యవసాయాభివృద్ధే రాష్ట్ర సర్కారు ప్రధాన లక్ష్యమని కేసీఆర్ పునరుద్ఘాటించారు. ఎన్ని కష్టాలొచ్చినా రైతుల సంక్షేమం కోసం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటామని కేసీఆర్ స్పష్టం చేశారు.

అయితే.. కేంద్ర సర్కారు తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయం వల్ల ఏర్పడిన మందగమనంతో పాటు కరోనా వల్ల ఏర్పడిన ఆర్థిక సమస్యలు, ఎఫ్ఆర్బీఎం నిధులు విడుదల చేయకపోవటం, తెలంగాణ పట్ల కేంద్రం చూపిన వివక్ష... లాంటి కారణాల వల్ల ఆర్థికలోటుతో ఇన్నాళ్లు కొంత ఆలస్యమైందని కేసీఆర్ చెప్పుకొచ్చారు. అయితే.. తిరిగి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చక్కదిద్దుకున్న క్రమంలో.. రాష్ట్రంలో రైతు రుణమాఫీ కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభించాలని కీలక నిర్ణయం తీసుకున్నట్టు కేసీఆర్ తెలిపారు.

ఈ విషయంపై ప్రగతిభవన్‌లో బుధవారం రోజున సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి హరీశ్ రావు, ముఖ్య సలహాదారు సోమేశ్ కుమార్, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, హెచ్ఎండీఎ ప్రిన్సిపల్ సెక్రటరీ అర్వింద్ కుమార్, వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్ రావు పాల్గొన్నారు.

నిజంనిప్పులాంటిది

Aug 03 2023, 11:19

AP High Court: ఆర్‌-5 జోన్‌లో ఇళ్ల నిర్మాణంపై నేడు హైకోర్టు తీర్పు

అమరావతి: రాజధాని అమరావతి ఆర్‌-5 జోన్‌లో ఇళ్ల నిర్మాణాన్ని నిలువరించాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యాలపై జస్టిస్‌ డీవీఎస్‌ఎస్‌ సోమయాజులు,

జస్టిస్‌ సీహెచ్‌ మానవేంద్రనాథ్‌రాయ్‌, జస్టిస్‌ రవినాథ్‌ తిల్హరిలతో కూడిన హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం గురువారం తీర్పు ఇవ్వనుంది..

రాజధానేతర ప్రాంత వాసులకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు అమరావతిలో ఆర్‌-5 జోన్‌ ఏర్పాటు,

1402 ఎకరాలను గుంటూరు, ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్లకు బదిలీ చేస్తూ ఇచ్చిన జీవోలు,

ఇళ్ల నిర్మాణ ప్రక్రియను సవాలు చేస్తూ రాజధాని ప్రాంత గ్రామాల రైతు సంక్షేమ సంఘాలు, రాయపూడి దళిత బహుజన సంక్షేమ ఐకాస హైకోర్టులో వ్యాజ్యాలు వేసిన విషయం తెలిసిందే..